ADB: తెలంగాణ రైతాంగంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న తీరు సరైనది కాదని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. ఇటీవల అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న అర్లీ(బి) గ్రామానికి చెందిన తుడం గణపతి కుటుంబ సభ్యులను ఆదివారం ఆయన పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆత్మహత్యకు ముందు ప్రభుత్వానికి రైతు తన ఆవేదన వ్యక్తం చేసిన పట్టించుకోలేదని తెలిపారు.