కృష్ణా: అవనిగడ్డ మండలం పాత ఎడ్లంకలో ఆదివారం రాత్రి శ్రమ దినాల శిలువ మార్గం కార్యక్రమం జరిగింది. క్రైస్తవ సోదరులు ఏసు శిలువ మార్గం నిర్వహించారు. సీనియర్ నాయకులు మాదివాడ వెంకటకృష్ణ శిలువ మోశారు. ఆర్.సీ.ఎం చర్చి ప్రాంగణంలో రెవరెండ్ ఫాదర్ సురేష్ దీక్షదారులతో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. క్రైస్తవ సోదరులు పాల్గొని ప్రార్ధనలు చేశారు.