ADB: ఈనెల 27వ తేదీ నుంచి కందుల కొనుగోలును కేంద్ర ప్రభుత్వ సంస్థ నాపేడ్ పూర్తిగా నిలిపివేసినట్లు ఆదిలాబాద్ మార్క్పెడ్ జిల్లా మేనేజర్ ప్రవీణ్ రెడ్డి ఆదివారం తెలియజేశారు. ఈనెల 26వ తేదీ వరకు రైతులు తమ కంది పంటను మార్కెట్ యార్డు తీసుకురావాలని సూచించారు. జిల్లా రైతులు విషయాన్ని గమనించి సహకరించాలని ప్రవీణ్ రెడ్డి కోరారు.