VSP: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో శతాబ్ది ఉత్సవాల సందర్భంగా జియోటెక్నికల్ అంశంపై రెండు రోజుల వర్క్షాప్ ఆదివారం ప్రారంభమైంది. ఐఐటీ ఢిల్లీ మాజీ సంచాలకులు ఆచార్య వీ.ఎస్. రాజు కార్యక్రమాన్ని ప్రారంభించి, విద్యార్థి అభివృద్ధికి విశ్వవిద్యాలయం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. పూర్వ విద్యార్థులు తమ జ్ఞానం, అనుభవంతో విద్యాలయం అభివృద్ధికి తోడ్పడాలన్నారు.