కృష్ణా: ఉయ్యూరు మండలం ఆకునూరు గ్రామంలో ఆదివారం ఉదయం అనుమానాస్పద ఘటన చోటుచేసుకుంది. తమిళనాడు నుంచి వచ్చామని చెప్పుకున్న కొంతమంది స్వామీజీలు, ప్రముఖ పారిశ్రామిక వేత్త ఇంటికి చేరుకుని డబ్బులు డిమాండ్ చేశారు. కోరిన మొత్తాన్ని ఇవ్వకపోతే శపిస్తామని ఇంట్లో ఉన్న వృద్ధ మహిళను బెదిరించినట్లు సమాచారం. ఈ ఘటనతో గ్రామంలో ఆందోళన నెలకొంది.