ASR: గంజాయి, నాటు సార వంటి మత్తు పదార్ధాలకు దూరంగా ఉండాలని పాడేరు డీఎస్పీ అభిషేక్ అన్నారు. ఆదివారం అరకులోయ మండలం, మాదల గ్రామంలో నిర్వహించిన ‘మీ కోసం మీ పోలీస్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గంజా సాగు, రవాణ, వినియోగం నేరమని, సైబర్ నేరాలు, రోడ్డు భద్రతలపై డీఎస్పీ అవగాహన కల్పించారు. మైనర్లకు వాహనాలు ఇస్తే చర్యలు తప్పవని ఎస్సై గోపాలరావు హెచ్చరించారు.