KMM: ముదిగొండ మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన డాక్టర్ నీరుకొండ ఉషారాణికి స్వర్ణ నంది ఉగాది పురస్కారం లభించింది. ఆదివారం ఖమ్మంలో జరిగిన కార్యక్రమంలో మొగిలి & ఎన్ఎస్ ఎంటర్టైన్మెంట్ ప్రతినిధులు ఆమెను సత్కరించారు. ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా మహిళా సాధికారత బాలకార్మిక నిర్మూలనకు చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ అవార్డు దక్కిందని ఆమె తెలిపారు.