GDWL: గ్రామాల సమగ్ర అభివృద్ధిలో వార్డు సభ్యులు కీలక పాత్ర పోషించాలని ఇటిక్యాల ఎంపీడీవో అజర్ మోహియిద్దీన్ పిలుపునిచ్చారు. ఆదివారం మండల కేంద్రంలోని రైతు వేదికలో వార్డు సభ్యులకు ఐదు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. వార్డుల్లోని సమస్యల పరిష్కారానికి వార్డు సభ్యులు కృషి చేయాలని, పంచాయతీల అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.