BDK: గుండాల మండలం మామకన్ను గ్రామపంచాయతీకి చెందిన 104 ఒప్పంద ఉద్యోగి పాయం నాగేశ్వరరావు (38) ఆదివారం ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు. గుండాల ప్రభుత్వ ఆసుపత్రిలో 104 సేవల్లో పనిచేస్తున్న ఆయనకు ఉదయం తీవ్రమైన గుండెనొప్పి రావడంతో వెంటనే వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఉదయం 9 గంటల సమయంలో పరిస్థితి విషమించి మృతి చెందారు.