ADB: బోథ్ మండల కేంద్రంలో నూతన ఫైర్ స్టేషన్ ఏర్పాటుకు ప్రభుత్వ అనుమతి లభించిందని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ ఆదివారం తెలిపారు. ఫైర్ స్టేషన్ ఏర్పాటుకు సహకరించిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాల్కు కృతజ్ఞతలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సంక్షేమం అందుతుందని పేర్కొన్నారు.