సత్యసాయి: పెనుకొండ టౌన్ మున్సిపాలిటీ పరిధిలోని సీపీఐ కాలనీలో ఆదివారం పోలీసులు వజ్ర పహార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమానిత వ్యక్తుల ఇళ్లలో సోదాలు నిర్వహించి గంజాయి వినియోగం వల్ల కలిగే ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా 21 ద్విచక్ర వాహనాలను తనిఖీ చేయగా, పత్రాలు లేని 2 వాహనాలను సీజ్ చేసినట్లు డీఎస్పీ నరసింగప్ప తెలిపారు.