NLG:నార్కట్పల్లిలోని పీవీఆర్ చేతన పాఠశాలలో జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం విద్యార్థులకు బెల్టులు అందజేశారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా ఎస్జీఎఫ్ సెక్రటరీ విమల మాట్లాడుతూ.. క్రీడల వల్ల శారీరక దృఢత్వంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ లభిస్తుందన్నారు. ఎగ్జామినర్ సుధాకర్ ఆధ్వర్యంలో మొత్తం 65 మంది విద్యార్థులు బెల్టులు సాధించారు.