CTR: పూతలపట్టు(M), పి.కొత్తకోట సమీపంలో ఇవాళ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. తిరుమల దర్శనానికి వెళ్తున్న కర్ణాటక రాష్ట్రం మండ్యకు చెందిన కుటుంబం ప్రయాణిస్తున్న కారు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సతీష్ (50), భాగ్యలక్ష్మి(45)అక్కడికక్కడే మృతి చెందగా, శశాంక్(23), పావని (10), మహాలక్ష్మీ(12), తుషార (4)లకు తీవ్ర గాయాలయ్యాయి.