AP: తూర్పు గోదావరి జిల్లా యర్నగూడెం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు వేగంగా హైవే డివైడర్ను దాటి మరో కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. మరో నలుగురికి గాయలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే సమీప గోపాలపురం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.