అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబోలో రాబోతున్న ప్రాజెక్టుపై అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ మూవీలో బాలీవుడ్ నటి అనుష్క శర్మ చేరినట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే దీపికా పదుకొనె, రష్మిక, మృణాల్, జాన్వీ కపూర్ వంటి హీరోయిన్లు ఉన్నట్లు ప్రచారం జరుగుతుండగా, అనుష్క చేరికతో ఈ సినిమాకు మరింత గ్లామర్ తోడైంది. ఇది ఆమెకు పవర్ ఫుల్ కమ్బ్యాక్ కానుందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.