SKLM: ఆమదాలవలస ఎమ్మెల్యే, PUC ఛైర్మన్ కూన రవికుమార్ ఏపీ మాజీ డీజీపీదొర మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శనివారం హైదరాబాద్లోని వారి నివాసానికి వెళ్లి, దొర చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన సేవలు ఏపీ పోలీస్ శాఖకు చిరస్మరణీయమని కొనియాడారు