సత్యసాయి: జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ ఆదేశాలతో పోలీసులు డ్రోన్ల ద్వారా అసాంఘిక కార్యకలాపాలపై నిఘా పెట్టారు. లేపాక్షి మండల అటవీ ప్రాంతంలో పేకాట ఆడుతున్న స్థావరాన్ని ఎస్సై నరేంద్ర బృందం డ్రోన్ కెమెరాల సాయంతో గుర్తించింది. ఈ దాడిలో ఏడుగురు జూదరులను అరెస్ట్ చేసి, వారి నుంచి రూ. 5,800 నగదు స్వాధీనం చేసుకున్నారు.