TG: రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ ఫామ్హౌజ్ డ్రగ్స్ కేసు కీలక మలుపు తిరిగింది. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్హౌజ్ను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. అసైన్డ్ భూమిలో కట్టారని తేల్చారు. అదేవిధంగా పార్టీకి వచ్చిన వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. రోహిత్ రెడ్డిని కస్టడీలోకి తీసుకున్నాక.. ఫామ్హౌజ్లోనే విచారించనున్నట్లు సమాచారం.