E.G: రాజమండ్రి రూరల్ టీడీపీ కార్యాలయం వద్ద రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆధ్వర్యంలో శనివారం ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ ప్రజల నుంచి పింఛన్లు, రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీరు తదితర సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించారు. వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.