MNCL: జైపూర్ మండలం శివ్వారం ఎర్ర చెరువులో మొసళ్ల సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. గ్రామానికి చెందిన సారక్క, సంపత్ రెడ్డిలకు చెందిన 2గేదెలను మొసళ్లు చంపివేసినట్లు గ్రామస్థులు తెలిపారు. చెరువు పరిసరాల్లో మొసళ్లు తిరుగుతుండటంతో పశువులను మేతకు తీసుకెళ్లాలన్నా, నీటి కోసం వెళ్లాలన్నా భయపడుతున్నామని గ్రామస్థులు వాపోయారు.