SRD: రంజాన్ పండుగ సందర్భంగా సంగారెడ్డి పట్టణ శివారులోని ఈద్గా మైదానంలో ముస్లిం సోదరులు శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముస్లిం మత పెద్దలు రంజాన్ పండుగ గురించి వివరించారు. ప్రార్థన అనంతరం ఒకరినొకరు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. డీఎస్పీ సత్తయ్య గౌడ్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.