TG: పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రద్దు అని వస్తున్న వార్తలను విద్యాశాఖ కమిషన్ OSD జీనత్ ఖండించారు. తాము ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో రద్దు చేయాలనే ప్రతిపాదన చేయలేదన్నారు. కానీ, విడివిడిగా ఉన్న టెన్త్, ఇంటర్ బోర్డును విలీనం చేయాలని ప్రతిపాదించామన్నారు. 11వ తరగతి పబ్లిక్ పరీక్షలను మాత్రమే రద్దు చేయాలని సూచించామన్నారు. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయొద్దని సూచించారు.