E.G: రాజమండ్రిలో కల్తీ పాల ఘటనలో అస్వస్థతకు గురైన వారిలో నలుగురు ప్రస్తుతం కోలుకుంటున్నట్లు డీఎంహెచ్ఓ డా.కె. వెంకటేశ్వరరావు తెలిపారు. వారికి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. ఈ ఘటనలో మొత్తం 20 మంది బాధితులలో 15 మంది మృతి చెందగా, ఎన్.కొండబాబు (64) కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం నలుగురు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.