SDPT: వర్గల్ మండల కేంద్రంలోని ప్రధాన రహదారి అధ్వానంగా తయారైంది. సాయిబాబా ఆలయం నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు పడటంతో స్వల్ప వర్షానికే చెరువును తలపిస్తోంది. నిత్యం వేలాది మంది ప్రయాణించే ఈ మార్గంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరారు.