PDPL: ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా సింగరేణి ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లాలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆర్జీ-3 జీఎం డి. లలిత్ కుమార్ మాట్లాడుతూ.. పిచ్చుకల సంఖ్య తగ్గిపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. పర్యావరణ సమతుల్యతకు పిచ్చుకలు ముఖ్యమని, వాటి సంరక్షణకు ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.