BHNG: తుర్కపల్లి మండలం తిరుమలాపురం గ్రామానికి చెందిన సీనియర్ రిపోర్టర్ అరె నరసింహాలు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య వెంటనే స్పందించి, బాధితుడిని పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితుని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.