విశాఖ నుంచి బయలుదేరే ఎక్స్ప్రెస్ రైళ్లలో ఏడీఆర్ఎం (ఆపరేషన్స్) శ్రీ కె. రామారావు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. బెడ్ షీట్లు, శుభ్రతను పరిశీలించి ప్రయాణికులతో మర్యాదగా ప్రవర్తించాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం సిబ్బంది, సూపర్వైజర్లు, హెల్త్ ఇన్స్పెక్టర్లతో నిర్వహించిన కౌన్సెలింగ్లో సేవా ప్రమాణాలు పెంచాలని, ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలన్నారు.