NLG: నల్గొండ గడియారం సెంటర్ వద్ద గల మంత్రి క్యాంపు కార్యాలయానికి శుక్రవారం ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున చేరుకున్నారు. సీఐటీయూ ఆధ్వర్యంలో పట్టణంలోని సీపీఎం పార్టీ కార్యాలయం నుంచి క్యాంపు కార్యాలయానికి ర్యాలీగా చేరుకుని ధర్నాకు దిగారు. ఆర్డీవో అశోక్ రెడ్డి అక్కడికి చేరుకుని వారి సమస్యలను విని సానుకూలంగా స్పందించారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానన్నారు.