JGL: బీర్పూర్ మండల కేంద్రంలో భూ వివాదాల నేపథ్యంలో అధికారులు సెక్షన్ 144ను అమలు చేశారు. ఈ ఆదేశాల ప్రకారం నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది ఒకచోట గుమికూడరాదు. శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలు చేపట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. మండలంలో ఎక్కడికక్కడ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని SI రాజు తెలిపారు.