ADB: జిల్లాలో నీటి సమస్యలు రోజురోజుకీ తీవ్రమవుతున్నాయి. వేసవి ప్రారంభంతో గ్రామాల్లో నీటి కొరత పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మిషన్ భగీరథ ద్వారా సరఫరా ఉన్నప్పటికీ కొన్ని రోజులపాటు నీరు రాకపోవడం వల్ల పరిస్థితి మరింత దిగజారుతోంది. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.