WNP: రైతు నేస్తం ఫౌండేషన్ ప్రతి ఏటా అందించే శ్రీ తుమ్మేటి రాఘోత్తమ రెడ్డి రైతు నేస్తం మిద్దె తోట పురస్కారం-2025కు వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన పోల్కంపల్లి సుజాత ఎంపిక అయింది. తన ఇంటి టెర్రస్పై సేంద్రియ పద్ధతిలో కూరగాయలు, పండ్లు, ఆకుకూరలను గత 5సం.లుగా సాగు చేస్తున్నందున ఆమెను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. శనివారం ఏపీలోని గుంటూరులో ఈఅవార్డును అందజేయనున్నారు