IPL 2026లో సత్తా చాటాలని యువ ప్లేయర్లు ఆత్రుతగా ఉన్న వేళ.. పలువురు సీనియర్లకు ఇదే చివరి టోర్నీ కానుంది. లిస్టులో 44 ఏళ్ల ధోనీ(CSK) పేరే ముందుంది. ప్రతి ఏటా ఈ వార్త వినిపిస్తున్నా ఇప్పుడు పక్కా అని టాక్. 2012 నుంచీ KKRకే ఆడుతున్న నరైన్(37), అలాగే ఇషాంత్(37-GT) కూడా ఈ టోర్నీ తర్వాత ఆడబోరని తెలుస్తోంది. అటు రహానే(37-KKR), స్టార్క్(36-DC) ఇదే బాట పట్టనున్నారని సమాచారం