కృష్ణా: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి న్యూస్ ఛానల్ ఏపీ బ్యూరో రిపోర్టర్ కేసంనేని పూర్ణచంద్రరావు మృతి పట్ల ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయవాడ పడమటిలంకలోని స్వగృహంలో పూర్ణ భౌతిక కాయానికి ఎమ్మెల్యే రాము శుక్రవారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. పూర్ణచంద్రరావు మృతి విచారకరమని అన్నారు.