WGL: రైతులు మక్కజొన్నలను దళారులకు అమ్మి మోసపోవద్దని కలెక్టర్ సత్య శారద సూచించారు. నర్సంపేట పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో మార్క్ఫెడ్ మక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ ఛైర్మన్ శ్రీనివాస్తో కలిసి ఆమె ఇవాళ ప్రారంభించారు. జిల్లాలో మొత్తం 8 మార్క్ఫెడ్ కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నామని తెలిపారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.