NLG: ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం సీఐటీయూ ఇచ్చిన ‘ఛలో హైదరాబాద్’ పిలుపు నేపథ్యంలో గట్టుప్పల్లో ఉద్రిక్తత నెలకొంది. నిరసనకు వెళ్లకుండా పోలీసులు ఆశా వర్కర్లను ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఈ చర్యను సీఐటీయూ నాయకులు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య హక్కులను అణగదొక్కడం తగదని, అణచివేతతో సమస్యలు పరిష్కారం కావని వారు పేర్కొన్నారు.