VKB: కొడంగల్ పట్టణంలో ఆశా కార్యకర్తలు తమ డిమాండ్లు పరిష్కరించమని డిమాండ్ చేస్తూ రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో తెల్లవారుజామున నుంచే పోలీసులు ఇంటి పరిసరాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. రహదారులను బారికేడ్లతో కట్టివేసి, ప్రతి వ్యక్తి వివరాలు అడిగి తనిఖీ చేసిన తర్వాత మాత్రమే ముందుకు వెళ్ళడానికి అనుమతిస్తున్నారు.