GDWL: గద్వాల పట్టణం జమ్మిచేడులోని శ్రీ జమ్ములమ్మ ఆలయం శుక్రవారం భక్తులతో కిటకిటలాడింది. వారాంతపు ప్రత్యేక పూజల సందర్భంగా అమ్మవారిని శోభాయమానంగా అలంకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన భక్తులు దర్శనం చేసుకుని పులకించిపోయారు. అమ్మవారికి కుంకుమార్చనలు, ప్రత్యేక హారతులు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.