ATP: జిల్లాలో కురిసిన అకాల వర్షం, ఈదురుగాలులకు పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. నార్పల మండలంలో సుమారు 125 ఎకరాల్లో మొక్కజొన్న, 50 ఎకరాల్లో వరి పంట నష్టపోయినట్లు ఏవో చిన్న వీరస్వామి తెలిపారు. గంగనపల్లి, బొందలవాడ ప్రాంతాల్లో అరటి తోటలు నేలకొరగడంతో లక్షలాది రూపాయల నష్టం వాటిల్లిందని ఉద్యానశాఖ అధికారి నెట్టికంటయ్య పేర్కొన్నారు.