SDPT: ఇల్లంతకుంట మండల కేంద్రంలోని జామా మసీదులో ప్రభుత్వం తరఫున ఇఫ్తార్ విందు ఇవాళ ఘనంగా నిర్వహించారు. మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు జమాల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సామూహిక నమాజ్ అనంతరం ఉపవాస దీక్షలో ఉన్న ముస్లింలకు ఫలహారాలు అందించి ఉపవాసం విరమింపజేశారు. రంజాన్ మాసం పవిత్రతను గుర్తుచేస్తూ ఉపవాసం ద్వారా సహనాన్ని, పేదల బాధను అర్థం చేసుకోవాలని తెలిపారు.