అన్నమయ్య: పెనగలూరు మండలం ఇండ్లూరు సమీపంలోని వైన్ షాప్ వద్ద జరిగిన గొడవలో నర్సింహులు (38) అనే వ్యక్తి మృతి చెందిన ఘటనకు సంబంధించి, పోలీసులు గురువారం ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ నెల 11న వైన్ షాప్ వద్ద నర్సింహులుపై కంబాలకుంటకు చెందిన గుండ్లూరు వెంకటేశ్, గణేశ్ తీవ్రంగా దాడి చేశారు. తీవ్ర గాయాలైన నర్సింహులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 17న మరణించారు.