RR: శేరిలింగంపల్లి రాజీవ్ గృహకల్పలోని సాయిబాబా ఆలయ అభివృద్ధిలో భాగంగా మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ నూతన బోర్ వెల్ను ప్రారంభించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన పరాభవ నామ సంవత్సర పంచాంగ శ్రవణంలో పాల్గొని నూతన సంవత్సర ఫలితాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నిండాలని ఆకాంక్షిస్తూ ప్రజలకు ఆయన ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.