MNCL: రాష్ట్ర BJP ఆదేశాల మేరకు ఈనెల 20న ఉదయం 11 గంటలకు జిల్లా కలెక్టరేట్ ముందు చేపట్టే ధర్నాను విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ తెలిపారు. అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు, ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వాలని కోరుతూ జిల్లా పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తామని పేర్కొన్నారు. కావున జిల్లా, మండల నాయకులందరూ ఈ ధర్నా కార్యక్రమానికి హాజరుకావాలని కోరారు.