NTR: విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ వర్ధంతి కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రిగా అబుల్ కలాం ఆజాద్ విద్యలో అనేక మార్పులు తీసుకువచ్చి, ప్రతి ఒక్కరూ చదువుకోవాలని సంకల్పంతో విధులు నిర్వహించారని కొనియాడారు.