AKP: నర్సీపట్నంలో చింతకాయల అయ్యన్నపాత్రుడు నివాసంలో పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు, పంచాంగ శ్రవణ కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య చింతకాయల రాజేష్ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, పండితులు నూతన సంవత్సర పంచాంగ శ్రవణాన్ని పఠించారు.