W.G: ఉగాది పురస్కరించుకుని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ-కృష్ణ తులసి దంపతులు గురువారం తణుకులో పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. తొలుత వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ముత్యాలమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. నియోజకవర్గ ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.