ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన 22 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తహసీల్దార్ రాంప్రసాద్ నేతృత్వంలో పాశాల లింగయ్య ఇంట్లో జరిపిన తనిఖీల్లో ఈ బియ్యం బయటపడింది. ఈ మేరకు అధికారులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.