యుద్ధ మేఘాల వల్ల దేశంలో LPG సరఫరాపై అనిశ్చితి నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. హర్యానాలోని గురుగ్రామ్ (సోహనా, సెక్టార్-33)లో పైలట్ ప్రాజెక్టుగా దేశంలోనే తొలిసారిగా LPG ATMను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆటోమేటిక్ వెండింగ్ మెషిన్ వారంలో ఏడు రోజులు, 24 గంటల పాటు పనిచేస్తుంది.