SRCL: ఉగాది పర్వదినం సందర్భంగా వేములవాడలో నిర్వహించిన ఏరువాక పనుల కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ పుల్కం రాజు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం ఉగాది పర్వదిన సందర్భంగా రైతు సంఘం ఆధ్వర్యంలో ఏరువాక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలోవైస్ ఛైర్మన్ నరాల శేఖర్, మున్సిపల్ కౌన్సిలర్లు తోట రాజు, కొక్కుల బాలకిషన్, కొండ శేఖర్ పాల్గొన్నారు.