VKB: కుల్కచర్ల మండలానికి నేడు మిషన్ భగీరథ నీరు పంపిణీ లేదని అధికారులు వెల్లడించారు. నీటి పంపిణీలో సమస్య వచ్చిందని పేర్కొన్నారు. గ్రామాలలోని పంచాయతీ కార్యదర్శులు, ప్రజాప్రతినిధులు తమ గ్రామాల బోర్ల ద్వారా ప్రజలకు నీరు అందించాలని చెప్పారు. పండగ రోజున ఏర్పడ్డ ఇబ్బందులను ప్రజలు గమనించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని మిషన్ భగీరథ అధికారులు కోరారు.