TG: వరంగల్లోని భద్రకాళి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉగాది పండగ సందర్భంగా అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పంచామృతాలతో పాటు వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. భద్రకాళి దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ఆలయ అధికారులు భక్తుల దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.